Govindudu okkade గోవిందుడు ఒక్కడే.:

మన అందరివాడు గోవిందుడు మరో మూడు వారాల పాటు ఒంటరిగానే ఉండబోతున్నాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని మే 3, 2020 వరకూ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

కోవిడ్-19 వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు దర్శనం నిలుపుద‌ల నిర్ణయాన్ని మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించడమైనది. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం కైంకర్యాలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయని తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది.

వాస్తవానికి ప్రభుత్వం ఇదివరకు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 14వ తేదీ వరకు మాత్రమే శ్రీవారి దర్శనాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, నేడు మోదీ ఈ లాక్‌డౌన్ సమయాన్ని మే3 వరకూ పొడగిస్తున్న ప్రకటించిన నేపథ్యంలో తితిదే ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

error: Content is protected !!